ePaper
Wednesday, April 15, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్కోతులను భయపెట్టాలనుకుంటే ప్రాణమే పోయింది..

కోతులను భయపెట్టాలనుకుంటే ప్రాణమే పోయింది..

📰 Generate e-Paper Clip

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. కోతులను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ వైర్లను తగలటంతో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.

ఇంటర్‌నెట్ డెస్క్ ఏప్రిల్ 15 (మహాప్రభ) : కోతులను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ వైర్లను తగలటంతో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఛతర్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉండే ఓ హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తున్నాడు. నిన్న (మంగళవారం) హోటల్ దగ్గరకు పెద్ద సంఖ్యలో కోతులు వచ్చాయి.

ఆ యువకుడు కోతులను తరిమికొట్టడానికి ఓ పెద్ద ఇనుప రాడ్డును తీసుకున్నాడు. దాన్ని పైకెత్తి వాటిని కొట్టే ప్రయత్నం చేశాడు. భయపడిపోయిన కోతులు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయాయి. ఆ కోతులు మళ్లీ తిరిగిరాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో.. యువకుడు ఎత్తిన రాడ్డును కిందకు దించకుండా వెనక్కు నడుచుకుంటూ రాసాగాడు. ఈ నేపథ్యంలోనే ఆ రాడ్డు 33 కిలోవాట్స్ హైటెన్షన్ వైర్లను తగిలింది. కరెంట్ షాక్ కారణంగా అతడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ హోటల్‌లో పని చేసే ఓ అమ్మాయి శబ్ధం విని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి షాక్ అయింది. భయంతో హోటల్‌లోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అందుకే ఏదైనా పని చేసే ముందు వెనకా ముందు చూసుకోవాలి. లేదంటే ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది’..‘కోతులను కొట్టడానికి అంత పెద్ద రాడ్డు అవసరమా?. అతి చేయటం వల్లే ప్రాణం పోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!