ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఏపీ పిలుస్తోంది! 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబుఏపీ పిలుస్తోంది! 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

ఏపీ పిలుస్తోంది! 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌, పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి ఏపీ రెండు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

  • రెండేళ్లలోపే 24 లక్షల ఉద్యోగాల సృష్టి.. 2047 నాటికి 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ 
  • ఇదే లక్ష్యంతో ప్రణాళికాబద్ధ కార్యాచరణ.. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్‌ సిటీగా అమరావతి
  • విశాఖకు గూగుల్‌.. త్వరలో రిలయన్స్‌ కూడా.. పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌కు రండి..
  • సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం
    • ‘‘ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్‌ డేటా సెంటర్‌ రూపంలో విశాఖకు వచ్చింది. ఆ సెంటరుకు ఇటీవలే శంకుస్థాపన చేశాం. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఇంగాట్‌ సోలార్‌ వేఫర్‌ ఉత్పత్తికి రెన్యూ ఎనర్జీ సంస్థ సిద్ధమైంది. ఏపీలో మొదటిసారి విద్యుత్‌ కొనుగోళ్ల వ్యయాన్ని తగ్గించాం. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్‌ నగరంగా అమరావతిని నిర్మిస్తున్నాం.’’

సీఐఐతో సుదీర్ఘ బంధం..

‘‘సీఐఐతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. సీఐఐ సహకారంతో నేను పెట్టుబడులను ఆకర్షించాను. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నాకు ఎజెండా. పరిజ్ఞానం, టెక్నాలజీ, వేగం అనే అంశాలపైనే ప్రపంచ పోటీ నడుస్తోంది. క్వాంటం, ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్‌, ఇంటలిజెంట్‌ లాజిస్టిక్స్‌ రంగాలను అందిపుచ్చుకునేలా పనిచేస్తున్నాం. టెలికమ్‌ డీ రెగ్యులేషన్‌, ఓపెన్‌ స్కై విధానం, విద్యుత్‌ సంస్కరణలు, రహదారులు తదితర రంగాల్లో జరిగిన విప్లవాత్మక మార్పుల్లో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది.’’

మన అవసరాలు ఇవీ..

‘‘దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. పశ్చిమబెంగాల్‌ లో కూడా మంచి ఫలితాలు లభించి సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ రాష్ట్రంలో గత కొంతకాలంగా అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు. గ్రీన్‌ ఎనర్జీ, బయోగ్యాస్‌, ఇథనాల్‌, ఈవీ, వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు ప్రస్తుతం మనకు అవసరం. మైక్రో గ్రిడ్‌ వ్యవస్థల ద్వారా విద్యుత్‌ పంపిణీ నష్టాలను ఎదుర్కొంటున్నాం. ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. నేను 1990వ దశకంలో విద్యుత్‌ సంస్కరణలను ప్రవేశపెట్టి చెప్పుకొదగ్గ ఫలితాలు సాధించాను. అయితే దాని వల్ల రాజకీయంగా నష్టపోయి 2004లో ఓడిపోయాను.’’ అని చంద్రబాబు వివరించారు.

కలిసి నడిస్తేనే భవిష్యత్తు..

‘‘భవిష్యత్‌ అవసరాల కోసం విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం కలిసి కృషి చేయాలి. పరిశ్రమలకు అవసరమైన నిపుణులను విద్యాసంస్థలు అందించాలి. ప్ర భుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తే, విద్యారంగం మానవ వనరులను అందిస్తుంది. ఉపాధికి అర్హత అనేది జాతీయ మిషన్‌గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిశోధన, స్కిల్లింగ్‌, స్టార్టప్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, గవర్నెన్స్‌, ఇన్నొవేషన్‌ లాంటి సమీకృత విధానాలపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!