ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఇసన్నపల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు

ఇసన్నపల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

భిక్కనూరు  ఏప్రిల్ 30 ( మహాప్రభ )

ఎండలు మండుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా,భిక్కనూరు మండలంలో ఇసన్నపల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు చల్లని నీరు అందిస్తూ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు ఎండల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాకల రాములు, గ్రామ ఉప సర్పంచ్ బొమ్మగారి రాజమణి,గ్రామ కార్యదర్శి సుమేధ రెడ్డి మరియు వార్డ్ సభ్యులు బొల్లం సురేష్, శాల కృష్ణారీ,ఎర్నోల్లా స్వామి, యాద గౌడ్ మరియు గ్రామ మాజీ సర్పంచ్ గుడిసె రాములు,గ్రామ పెద్దలు,యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!