ePaper
Monday, April 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeకుక్కకు నిద్రమాత్రలు ఇచ్చి అక్రమంగా తరలింపుకుక్కకు నిద్రమాత్రలు ఇచ్చి అక్రమంగా తరలింపు.. స్పృహలోకి వచ్చాక రచ్చ రచ్చ.. వీడియో వైరల్

కుక్కకు నిద్రమాత్రలు ఇచ్చి అక్రమంగా తరలింపు.. స్పృహలోకి వచ్చాక రచ్చ రచ్చ.. వీడియో వైరల్

📰 Generate e-Paper Clip

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఒక మూగ జీవి ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన భారతీయ రైల్వేలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 10 (మహాప్రభ) : నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఒక మూగ జీవి ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన భారతీయ రైల్వేలో వెలుగుచూసింది. పెంపుడు కుక్కను ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలించేందుకు ఒక జంట దానికి నిద్రమాత్రలు ఇచ్చి మత్తులో ఉంచడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మెలుకువ వచ్చిన తర్వాత అయోమయానికి గురైన ఆ కుక్క కోచ్‌లో తిరుగుతూ రచ్చ చేయడం ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ జంటను రైలు నుంచి దింపేయగా, జంతు ప్రేమికులు ఈ క్రూరత్వంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సాధారణంగా రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లాలంటే ప్రత్యేక నిబంధనలు, అనుమతులు ఉంటాయి. అయితే, ఆ ఇబ్బందులు ఏవీ లేకుండా తప్పించుకోవాలని భావించిన ఒక జంట, తమ పెంపుడు కుక్కకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి దించింది. అనంతరం దానిని ఎవరికీ అనుమానం రాకుండా బెర్త్ కింద దాచి అక్రమంగా ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రయాణం మధ్యలో మత్తు వదిలిన ఆ కుక్క ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది. రైలు ప్రయాణం ఆ కుక్కకు విచిత్రంగా అనిపించింది. ఏం జరుగుతుందో అర్థం కాక కోచ్‌లో అటు ఇటు తిరుగుతూ విలవిలలాడింది. భయంతో అరిచింది, దాని ప్రవర్తన చూసి తోటి ప్రయాణికులు ఎంతో జాలిపడ్డారు. రైల్వే అధికారులు తక్షణమే స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించి కుక్కను అక్రమంగా తరలిస్తున్నందుకు, మూగ జీవి పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు ఆ జంటను తదుపరి స్టేషన్‌లోనే రైలు నుంచి కిందకు దింపేశారు. దీనిపై తదుపరి విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!