ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

📰 Generate e-Paper Clip

పీజీ వైద్య సీట్ల భర్తీపై కీలక నిర్ణయం వెలువడింది. తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌కు ఇకపై పొడిగింపు ఇవ్వలేమని న్యాయ స్థానం స్పష్టం చేసింది. జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇప్పటికే 7 రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో మరింత పొడిగింపు అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.

హైదరాబాద్, మార్చి 24 మహాప్రభ : తెలుగు రాష్ట్రాల్లోని పీజీ వైద్య విద్యార్థులకు, ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు పెద్ద షాక్‌గా మారింది. పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సిలింగ్ గడువును పొడిగించే ప్రసక్తే లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మిగిలిపోయిన పీజీ వైద్య సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని దాఖలైన పిటిషన్లను జస్టిస్ పీఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) వాదనలతో ఏకీభవిస్తూ కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!