టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ మధ్య కాస్త ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వివాదంపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్ మార్చి 11 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ మధ్య కాస్త ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. మిచెల్ మీదకు అర్ష్దీప్ బంతి విసిరి క్షమాపణలు కూడా చెప్పకపోవడంతో వాతావరణం వేడెక్కింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలగజేసుకుని మిచెల్కు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. మ్యాచ్ అనంతరం అర్ష్దీప్, మిచెల్ కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. మిచెల్ను క్షమాపణలు కోరుతూ అర్ష్దీప్ వివాదానికి తెరదించాడు. అయితే ఐసీసీ మాత్రం అర్ష్దీప్పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో ఆ వివాదంపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ స్పందించాడు.
