ePaper
Friday, July 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శాంతిభద్రతలపైనే సీఎం చంద్రబాబు దృష్టి: హోం మంత్రి అనిత

శాంతిభద్రతలపైనే సీఎం చంద్రబాబు దృష్టి: హోం మంత్రి అనిత

📰 Generate e-Paper Clip

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతలపై దృష్టి సారించారని హోం మంత్రి అనిత తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు.

కృష్ణా జిల్లా మే 11 ( మహాప్రభ ) : గత ఐదేళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడిరోడ్డుపై నిలబెట్టారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెబుతూ.. ఎస్పీ, ఐజీని హోం మంత్రి అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిని అనిత అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!