ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంసహజీవనం తర్వాత కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

సహజీవనం తర్వాత కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

📰 Generate e-Paper Clip

సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బ్రేక్-అప్ తర్వాత లైంగిక దాడి ఆరోపణలు వర్తించవని పేర్కొంది.

ఢిల్లీ ఏప్రిల్ 27 (మహాప్రభ) : సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బ్రేక్-అప్ తర్వాత లైంగిక దాడి ఆరోపణలు వర్తించవని పేర్కొంది. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం నేరం కిందకు రాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

పెళ్లి చేసుకోలేదని కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదని ధర్మాసనం సూచించింది. తప్పుడు వాగ్దానం, విఫలమైన వాగ్దానాల మధ్య తేడాను గుర్తించాలని కేసు విచారణ సందర్భంగా పిటిషనర్‌కు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర న్యాయవాదిపై నమోదైన అత్యాచారం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇద్దరి వ్యక్తుల బంధంలో ప్రారంభం నుంచీ మోసపూరిత ఉద్దేశం ఉంటేనే నేరం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!