ePaper
Wednesday, June 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం

ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం

📰 Generate e-Paper Clip

ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది.

ఢిల్లీ ఏప్రిల్ 22 (మహాప్రభ) : ఓటుకు నోటు కేసులో (Vote for Note Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ విజయ్ బిష్ణోయ్ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కేసు విచారణ జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో రెండు కీలక పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసినది.

ఎన్నికల చట్టాల ప్రకారం మాత్రమే విచారించాలి: సీఎం

సీఎం రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల ప్రకారమే విచారించాలని కోరారు. ఈ కేసును క్రిమినల్ అవినీతి కేసుగా కాకుండా ఎన్నికల ఉల్లంఘనగా పరిగణించాలని ఆయన వాదించారు.

ఈ కేసులో నా పేరును పూర్తిగా తొలగించాలి: సండ్ర వెంకట వీరయ్య

మరోవైపు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తనపై నమోదైన ఈ కేసులో తన పేరును పూర్తిగా తొలగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తనపై ఉన్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని ఆయన వాదించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటుకు నోటు కేసు గతంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడినప్పటికీ, ఈ కేసు ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. వచ్చే విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, నైతిక విలువలపై ఈ కేసు కీలకంగా నిలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!