భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సేవల్ని కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.
ఢిల్లీ, మార్చి17 మహాప్రభ : భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సేవల్ని కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ విప్లవాత్మకమైన మార్పుతో ఇకపై ఉత్తరాలు, పత్రాల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘బుక్ నౌ – పే లేటర్’ విధానం అమలు చేస్తామని తెలిపారు.
