ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఖర్గే‌ని కలిసిన జగ్గారెడ్డి.. అసలు విషయమిదే.

ఖర్గే‌ని కలిసిన జగ్గారెడ్డి.. అసలు విషయమిదే.

📰 Generate e-Paper Clip

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ(గురువారం) ఢిల్లీలో కలిశారు. ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడానని అన్నారు.

ఢిల్లీ, ఫిబ్రవరి 26 మహాప్రభ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను (Mallikarjun Kharge).. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఇవాళ(గురువారం) ఢిల్లీలో కలిశారు. ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడానని, వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి రాజ్యసభ ఇవ్వాలని కోరానని అన్నారు.ఇదే విషయంపై రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని కలవడానికి ఢిల్లీకి వచ్చానని తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని కోరానని తెలిపారు. జెట్టి కుసుమ కుమార్.. యూత్ కాంగ్రెస్ లీడర్‌గా, స్టూడెంట్ లీడర్‌గా.. కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారని ప్రస్తావించారు. జెట్టి కుసుమ కుమార్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్ అని, వాళ్ల కుటుంబం నుంచి అంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని గుర్తుచేశారు.

హనుమంతరావు తెలంగాణలో అనేక మంది ముఖ్యమంత్రులతో పని చేశారని వెల్లడించారు. మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని చెప్పుకొచ్చారు. ఆయనకు రాజీవ్ గాంధీ , సోనియాగాంధీ అవకాశాలు ఇచ్చారని తెలిపారు. వి.హనుమంతరావు చురుకైన వ్యక్తి అని, ఆయనకు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని ఖర్గేను కోరానని అన్నారు. కమిటీలో చర్చిస్తామని ఖర్గే హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!