- ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్
మెదక్ జిల్లా – ఫిబ్రవరి 20 (మహాప్రభ )
మెదక్ లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ను పురస్కరించుకొని భోగ్ బండారో జరుపుకొని భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు,ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ హాజరయ్యారు బంజారా వారందరూ తమ సంస్కృతి సాంప్రదాయాలతో ఆటపాటలతో డిజె సౌండ్ తో భారీ ర్యాలీ నిర్వహించి సేవలాల్ జయంతిని విజయవంతంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు బంజారా సర్పంచ్ నాయకులు తండావాసులు మహిళలు విద్యార్థులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
