📰 Generate e-Paper Clip
భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సేవల్ని కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.
ఢిల్లీ, మార్చి17 మహాప్రభ : భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సేవల్ని కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ విప్లవాత్మకమైన మార్పుతో ఇకపై ఉత్తరాలు, పత్రాల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘బుక్ నౌ – పే లేటర్’ విధానం అమలు చేస్తామని తెలిపారు.
ఇవాళ(మంగళవారం) నుంచి గ్యారంటీడ్ నెక్ట్స్ డే ద్వారా 24 గంటల్లో పోస్ట్ డెలివరీ సేవలు ప్రారంభమ్యాయి. ఇప్పటివరకు 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో 30 కోట్ల మంది ఈ-కామర్స్ వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం.. పార్శిల్ మార్కెట్ విలువ రూ.90,000 కోట్లు ఉంది. రాబోయే ఆరేళ్లలో రూ.1.8 లక్షల కోట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చే సేవలతో గ్రామీణ ప్రాంతాల వారికి అధిక ప్రయోజనం చేకూరనుంది. లాజిస్టిక్స్లో 60 శాతం వాటా ఈ ప్రాంతాల నుంచే వస్తోంది.
ఇవాళ(మంగళవారం) నుంచి గ్యారంటీడ్ నెక్ట్స్ డే ద్వారా 24 గంటల్లో పోస్ట్ డెలివరీ సేవలు ప్రారంభమ్యాయి. ఇప్పటివరకు 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో 30 కోట్ల మంది ఈ-కామర్స్ వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం.. పార్శిల్ మార్కెట్ విలువ రూ.90,000 కోట్లు ఉంది. రాబోయే ఆరేళ్లలో రూ.1.8 లక్షల కోట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చే సేవలతో గ్రామీణ ప్రాంతాల వారికి అధిక ప్రయోజనం చేకూరనుంది. లాజిస్టిక్స్లో 60 శాతం వాటా ఈ ప్రాంతాల నుంచే వస్తోంది.