ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే తమిళ బుల్లి తెర నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరవక ముందే.. ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 8 (మహాప్రభ) : ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే తమిళ బుల్లి తెర నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరవక ముందే.. ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటి జరీన్ ఖాన్ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్ బుధవారం తుది శ్వాస విడిచారు.
జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ ఆరోగ్యం గత కొంత కాలంగా క్షీణించడంతో ఆమెను ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జరీన్ ఖాన్ తన తల్లి ఆరోగ్యం పరిస్థితి గురించి గతంలోనే సోషల్ మీడియాలో ద్వారా అభిమానులకు తెలియజేస్తూ, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని కోరారు. ఈ క్రమంలోనే పర్వీన్ కాన్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూశారు. తల్లి మరణ వార్త తెలియగానే జరీన్ ఖాన్ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్న జరీన్ను ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఓదారుస్తున్నారు.
