ఐపీఎల్2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయర్లు 11వ నంబర్ జెర్సీలు ధరించనున్నారు. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో మరణించిన వారికి నివాళిగా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్ మార్చి 24 మహాప్రభ : గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి నివాళిగా ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయర్లు 11వ నంబర్ జెర్సీలు ధరించనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈవో రాజేశ్ మేనన్ వెల్లడించారు.
