కూడేరు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో రైతు బంగి వెంకటప్ప ఎకరం పొలంలో బంతిపూలు సాగు చేశారు. పసుపు వర్ణంతో పూలు విరబూసి కన్నుల విందు చేస్తున్నాయి.
ఫిబ్రవరి 28 మహాప్రభ, కూడేరు(అనంతపురం): కూడేరు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో రైతు బంగి వెంకటప్ప ఎకరం పొలంలో బంతిపూలు సాగు చేశారు. పసుపు వర్ణంతో పూలు విరబూసి కన్నుల విందు చేస్తున్నాయి. సాగు కోసం దాదాపు రూ.40వేలు పెట్టుబడి పెట్టాడు. అయితే కిలో రూ.6 ధర కూడా పలకడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కూలి కూడా రాకపోవడంతో పూలు కోయకుండా అలాగే వదిలేశాడు. దీంతో తోటంతా పసుపుపచ్చగా కనిపిస్తోంది.

