mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 5:38 am Digital Edition : Namastey Mahaaprabha

సామరస్యం, కరుణ, క్షమాగుణాలను మరింత పెంపొందించాలి: ప్రధాని మోదీ

గుడ్ ఫ్రైడే మనకు యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సమాజంలో సామరస్యం, కరుణ, క్షమాగుణం వంటి విలువలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.

న్యూఢిల్లీ ఏప్రిల్ 3 (మహాప్రభ) : ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఇవాళ ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ‘గుడ్ ఫ్రైడే’ పాటిస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తన సందేశాన్ని అందించారు. ఈ పవిత్ర దినం సమాజంలో సామరస్యం, కరుణ, క్షమాగుణాలను మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. గుడ్ ఫ్రైడే మనకు ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తున్న ఆయన, సమాజంలో సోదరభావం, ఆశ మనందరికీ మార్గదర్శకం అవ్వాలని ప్రధాని ఆకాంక్షించారు.