mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 7:10 am Digital Edition : MAHAA PRABHA DAILY

‘మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు’

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఇరాన్‌తో చర్చలకు దిగే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కూడా స్పందించారు.

ఇంటర్నెట్ డెస్క్ , మార్చి 13 మహాప్రభ : ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం.. కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో చర్చలకు దిగే పరిస్థితి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు పలువురిని నిరాశ కలిగించగా.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిజంగా శాంతిని కోరుకుంటే పరస్పర చర్చలకు సిద్ధం కావాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు.