కొన్ని దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 మహాప్రభ : కొన్ని దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది. గత కొన్నేళ్లుగా భారత్ పొరుగునున్న నేపాల్లో ఆయన మకాం వేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే గణపతిని భారత్కు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వృద్ధాప్యం కారణంగా మావోయిస్టు పార్టీ కార్యదర్శి పదవిని గణపతి వదిలిపెట్టిన సంగతి తెలిసిందే.