mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 11:43 am Digital Edition : MAHAA PRABHA DAILY

భారత నౌకల భద్రతపై ఇరాన్‌తో చర్చలు జరిపిన జైశంకర్.. ఎంఈఏ ప్రకటన

మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు, భారత నౌకల భద్రతకు సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రౌండ్లు చర్చలు జరిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ గురువారంనాడు తెలిపింది.

న్యూఢిల్లీ మార్చి 12 మహాప్రభ : మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు, భారత నౌకల భద్రతకు సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రౌండ్లు చర్చలు జరిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) గురువారంనాడు తెలిపింది. దీనిపై ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలు వెళ్లేందుకు ఇరాన్ అనుమతించిందా అనే ప్రశ్నకు, ప్రస్తుతానికి ఇంతవరకే తాను చెప్పగలనని సమాధానమిచ్చారు.