mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 11:18 am Digital Edition : MAHAA PRABHA DAILY

ప్రతి బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పీవీఎన్ మాధవ్ ఆదేశం

ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.

అమరావతి, మార్చి 18 మహాప్రభ: ఉగాది పర్వదినం సందర్భంగా పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(PVN Madhav) దిశానిర్దేశం చేశారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యాలయంలో పురోహితులను పిలిపించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పంచాంగ శ్రవణం తప్పనిసరిగా జరగాలని ఆయన ఆదేశించారు.