mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 7:26 am Digital Edition : Namastey Mahaaprabha

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్లు

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఉపసంహరణకు మార్చి 9 చివరి తేదీ, 16న పోలింగ్ ఉంటుంది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 మహాప్రభ : భారత ఎన్నికల సంఘం 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కీలక తేదీలు ఇలా ఉన్నాయి:

నామినేషన్ల ప్రారంభం: నేటి నుంచే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు.

 

చివరి తేదీ: నామినేషన్ల దాఖలుకు మార్చి 5 వరకు గడువు ఉంటుంది.

 

పరిశీలన (Scrutiny): దాఖలైన నామినేషన్లను మార్చి 6న అధికారులు పరిశీలిస్తారు.

ఉపసంహరణ: పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు మార్చి 9 వరకు అవకాశం కల్పించారు.

పోలింగ్, ఫలితాలు: ఒకవేళ అవసరమైతే (ఏకగ్రీవం కాని పక్షంలో) మార్చి 16న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.