తిరుపతిలో వివాహితపై ఇంటి యజమాని అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి ఏప్రిల్ 4 (మహాప్రభ) : తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మహిళపై అత్యాచారయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 2న గురువారం తెల్లవారుజామున అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్ అక్కారంపల్లి రోడ్డు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాబుతో ఒంటరిగా ఉన్న మహిళపై ఇంటి యజమాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళపై దారుణంగా వికృత చేష్టలు చేయడంతో పాటు ఫోన్లో ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టాడు.
ఈ ఘటనతో మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. భర్త విదేశాల్లో ఉండటంతో పుట్టింటికి వెళ్లి బంధువుల సహాయంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంటి యజమాని శ్రీనివాసులు రెడ్డిపై రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.