mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 12:05 pm Digital Edition : MAHAA PRABHA DAILY

జాతీయ గీతాన్ని ఆలపించడానికి నిరాకరించిన ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్లు

అంతర్జాతీయ వేదికపై ఇరాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు మైదానంలో జాతీయ గీతం ఆలపించే సమయంలో ఇరాన్ ప్లేయర్లు మౌనంగా ఉండిపోయారు. ఖమేనీ మృతికి నిరసనగా ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 3 మహాప్రభ : అంతర్జాతీయ వేదికపై ఇరాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు మైదానంలో జాతీయ గీతం ఆలపించే సమయంలో ఇరాన్ ప్లేయర్లు మౌనంగా ఉండిపోయారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడన్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నిరసనగా ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.