గేమింగ్ పేరుతో రూ.5 వేల కోట్ల స్కామ్.. బయటపెట్టిన పోలీసులు.. : Mahaaprabha
ఆన్లైన్ గేమింగ్ పేరుతో వేల కోట్ల రూపాయల భారీ స్కామ్ను పోలీసులు బయటపెట్టారు. డొల్ల కంపెనీలకు దాదాపు రూ.5 వేల కోట్లు మళ్లించినట్లు విచారణలో బయటపడింది.. హైదరాబాద్, ఫిబ్రవరి 9,మహాప్రభ : నగరంలో భారీ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ (Online Gaming Scam) గుట్టును పోలీసులు రట్టు చేశారు. దుబాయ్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ స్కామ్ జరిగినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. డొల్ల కంపెనీలకు రూ.5వేల కోట్లు మళ్లించినట్టు గుర్తించారు. ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు, రెంటెడ్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ అక్రమ లావాదేవీలు జరిగినట్లు...